Showing posts with label రాజకీయం. Show all posts
Showing posts with label రాజకీయం. Show all posts

Wednesday, December 30, 2009

"కామీడియా"

 నా టపా చదివే ముందు విశాల ప్రపంచం బ్లాగు లో ప్రచురితమైన అడిగే వాళ్ళే లేరా? చదవ వలసినది గా నా మనవి.
http://venugaanam.blogspot.com/2009/12/blog-post_30.html                    మీడియా కి ప్రముఖుల రాసలీలలు కావాలి వారి టి.ఆర్.పి రేటింగ్ లు పెంచుకోవడానికి, కాని వారి చేతిలో బుగ్గి పాలైన వారి జీవితాల బవిష్యత్ అక్కర్లేదు. మీడియా కి హీరో ల సెలెబ్రిటి, లెజెండ్ ల గొడవలు కావాలి, హీరోయిన్ లు స్నానం చేస్తుంటే దొంగ తనంగా తీసిన వీడియో లు కావాలి.అవి అయితే నిమిషానికి 5 సార్లు ప్రసారంచేస్తారు. కాని సామాన్యులైన వారి అభిమానుల మానసిక సంగర్షణ అక్కర్లేదు.ఎవరైనా దొంగ ఉద్యమాలు నడిపితే వారి ఇంటర్వ్యూ లు కావాలి. మీడియా కి ఎవరైనా బస్సులు తగలబెడుతుంటే ఆ ఫోటోలు కావాలి, కాని అదే బస్సు లో ఎవరైనా తగలబడుతుంటే అక్కర్లేదు. మీడియా కి దొంగ స్వాముల విలాసాలు కావాలి వీడియో తీయడానికి. మీడియా కి హింస, బంద్, గొడవలు, రాసలీలలు, టేర్రరిసం ఇవే కావాలి కానీ, వాటి వల్ల సామాన్యులు పడుతున్న కష్టాలు, బాదలు, అగచాట్లు అక్కర లేదు.అసలు వాటిని  ప్రబుత్వం ముందుకు ఎందుకు తీసుకు రావాలి అని మనల్నే ప్రశ్నించిన కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు.  మీడియా అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ అయి పోయింది. ప్రజలు కూడా అలాగే అలవాటు పడ్డారు. ఇప్పుడున్న "మీడియా" కి "కామీడియా" అని పేరు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.    
                   ఈ టపా మంచి వార్తల్ని ప్రజలకు అందించే మీడియా గురించి రాసింది కాదు, కేవలం నేను పైన ప్రస్తావించిన వాటిని చేసే మీడియా గురించి మాత్రమే అని అర్థం చేసుకోవలసింది గా మనవి.

Monday, December 28, 2009

రాజకీయాల్లో రామ్ గోపాల్ వర్మ,తెలుగు ప్రజల ఖర్మ

             తెలుగు గడ్డ మీద పుట్టి ఒకానొక సమయం లో అందరి చేత బారత దేశం లోనే గొప్ప క్రియేటివ్  డైరెక్టర్ గా పేరు పొందిన రాంగోపాల్ వర్మ తాను పుట్టిన ఈ తెలుగు గడ్డ కి ఏం చేసాడు అని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి కామెంట్ చేస్తున్నాడు.తాను తీసిన "ప్రేమకథ" అనే సినిమా బాగా ఆడలేదనే ఆక్రోశం తో తెలుగు ప్రజలకి అసలు టేస్టే లేదు అసలు సినిమాను ఎలా చూడాలో కూడా తెలియదు దూషించాడు. మళ్ళి ఇక్కడ  జన్మ లో సినిమాలు తీయన్ని చెప్పి ముంబై కి వెళ్ళిపోయిన అతను ఏ ముఖం పెట్టుకుని తన సినిమాలు తెలుగు లో మళ్ళి తీస్తున్నాడు.


                                                             

                        రామ్ గురించి చెప్పాల్సి వస్తే  రామ్ గోపాల్ వర్మ కి కొంచం అహంకారం ఎక్కువ. తన కన్నా పెద్ద స్టార్లతో సినిమాలు చేయాలంటే ఇతడు ఒప్పుకోడు. ఇది ఇప్పటికే రుజువయింది చిరంజీవి సినిమాను ఆపేయడం ద్వారా. ఆ విషయాన్ని రామే స్వయంగా ఒప్పుకున్నాడు tv9 ఇంటర్వ్యూ లో. (హిందీ లో అమీర్ ఖాన్, అమితాబ్ లతో తీసిన అవి వాళ్ళ కెరీర్ అంతంత మాత్రంగా ఉన్నపుడే, అమీర్ కి ఇమేజ్ వచ్చాక మళ్ళి అమీర్ తో తీయను అని చెప్పాడు). రామ్ ముందు నుంచి కొంచం డిఫరెంటే. తాను తీసిన సినిమా తనే బాగా లేదంటాడు కొన్ని రోజుల తర్వాత. పెళ్లి చేసుకోవట్లేదు ఏంటి ఫ్యామిలీ లైఫ్ ఇష్టం లేదా? అని అడిగితే హీరోయిన్స్ ఉన్నారు కదా అంటాడు. మరీ రామ్ కంటికి హీరోయిన్స్ అంతా చీప్ గా కనబడుతున్నరేమో. సినిమాలు తీస్తాడు, రిలీజ్ అవక ముందే పార్ట్-2 అనౌన్స్ చేస్తాడు. పోనీ అవి తీస్తాడా? అంటే అదీ లేదు. అవి ఎందుకు బాగా ఆడలేదు అని అడిగితే, సినిమాలు నా కోసం నేను తీసుకుంటాను, ప్రజల కోసం తీయను అంటాడు. మరీ అలాంటపుడు రిలీజ్ చేయకుండా తనే ఇంట్లో చూసుకోవచ్చు కదా. పైగా తీసిన సినిమాల్లో నటించిన వాళ్లకి రెమ్యునరేషన్ ఇస్తాడా అంటే అదీ లేదు. పాపం ఒకసారి తన గోడు ని జే.డి చక్రవర్తి మీడియా ముందు వెల్లగక్కుకున్నాడు ఏమి చేయలేక.  
                      ప్రస్తుత విషయానికొస్తే రాము కి వివాదాలన్న క్రైం అన్నా చాల మక్కువ ఎక్కువ. అందుకే కాబోలు ముంబై దాడుల తర్వాత అందరు హోటల్ తాజ్ దగ్గరికి అక్కడి వారిని పరామర్శిండానికి వెళితే మన వాడు మాత్రం కథ ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్ళాడట. దాని ఫలితం మహారాష్ట్ర సి.ఎం. రాజీనామా మన వర్మ ని వెంటబెట్టుకేల్లినందుకు. తాను తీయబోయే రక్త చరిత్ర అనే సినిమాకి ఏమైనా ఉపయోగ పడుతుంది అనే ఉద్దేశం తోనే గొడవలు పెంచడానికి తన అభిప్రాయం సూటి గా చెప్పకుండా లగడపాటి కి సపోర్ట్ చేసినట్టు కనబడుతోంది రాష్ట్ర రాజకీయాల విషయంలో.

Thursday, December 24, 2009

ఔను. తెలంగాణా ప్రజలు తెలబన్సే

                ఈ మద్య కొందరు తెలుగు వాళ్ళు(మన ఖర్మ కొద్ది) తెలుగు వారందరం కలిసి ఉండాలి అంటూనే,మళ్ళి అదే తెలుగు ప్రజలైన తెలంగాణ వారిని తాలిబాన్ల తో పోల్చుతూ తెలబాన్స్ అని పిలుస్తున్నారు. ఇదెక్కడి విడ్డురం. పొమ్మన లేక పొగ బెట్టడం అంటే ఇదేనేమో. అలా అన్న వారికి నేను చెప్పేది ఒక్కటే గాందీ మార్గంలో, "ధన్య వాదాలు". తెలంగాణ వారిని తాలిబన్లతో పోల్చి తెలబన్స్ అని పిలిచి ప్రపంచ స్థాయి కి చేర్చినందుకు.
               1989 లో  తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తాము నమ్మిన సిద్దాంతాల్ని అమలు పరుచుకోవడానికి తమ వారిని బానిసలు గా చేసి కనీసం తమకు ఇష్టమైన చదువుని కూడా దూరం చేస్తున్న రష్యా వారిని ఎదిరించటానికి కన్నా వాళ్లకి దూరమై, ఇష్టమైన చదువుని, వృత్తుల్ని త్యాగం చేసి రష్యా వాళ్ళ పై  పోరాటం జరిపి తమ దేశం నుండి రష్యా సేనల్ని తరిమి గొట్టిన తాలిబన్లతో తెలంగాణా వాళ్ళని పోలిస్తే, అవును తెలంగాణా వాళ్ళు తెలబన్సే. ప్రపంచంలో తామే ధనిక దేశంగా వుండాలని కలలు కంటూ, మిగతా దేశాలను పట్టి పీడిస్తూ, వాళ్ళ మతాలను హేళన చేస్తూ, సంస్కృతులను కాలరాస్తూ, ఎదుటి దేశాల పై యుద్దాలు ప్రకటిస్తూ యుద్ద దాహాన్ని తీర్చుకుంటున్న అమెరికా ని, తమ మతాన్ని, సంస్కృతి ని కాపాడుకోవడానికి ఎదిరించిన తాలిబాన్ల తో పోలిస్తే అవును తెలంగాణా ప్రజలు తేలబన్సే.
                    తెలంగాణా ప్రజలు తెలబన్స్ అయితే మరీ మిగతా తెలుగు ప్రజలు (ఇక్కడ నా సోదర సమానులైన మిగతా తెలుగు ప్రజలు నన్ను క్షమించ గలరు) అందబన్సా? అంటే నిజ నిజాలు తెలుసుకోకుండా కుట్ర కుతంత్రాలతో కళ్ళు మూసుకు పోయిన అజ్ఞానం  లో  ఉన్న ఆంధులా? బ్లాగుల్లో  తెలబన్స్ అంటూ రాయటం తప్ప ఇంకేమి తెలియని  చావా కిరణ్ లాంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళతో గోడవోస్తే "ఆంధ్ర వాళ్ళని అడుక్కు తినే అందబాన్స్" అని రాయల సీమ వాళ్ళతో గోడవోస్తే "రాళ్ళు కొట్టు కోవడానికి తప్ప ఎందుకు పనికి రాని రాలబన్స్" అని అంటారు. ఇలా రెచ్చగొట్టి ప్రజా మనో భావాలని దెబ్బ తీసే వాల్లున్నంత కాలం రాష్ట్రం లో ప్రజలు కాదు కదా ఇంట్లో అన్నదమ్ములు కూడా కలిసుండ లేరు.
                    కాబట్టి తెలుగు ప్రజలు ఎలాంటి అవకాశవాదుల మాటలు నమ్మకుండా అన్నదమ్ముల మాదిరిగా కలిసి కట్టుగా రాష్ట్ర బాగు కోసం ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం నడుచుకోవాలి, అదీ  ప్రత్యేక తెలంగాణా ఐనా సరే. సమైక్యంద్ర ఐనా సరే.